తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆగస్టు 14న తాఖీదులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాల పునరుద్ధరణకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు పాటించని కారణంగా ఈ మేరకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాసనసభ్యులను బహిష్కరిస్తు ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ ను డీనోటిఫై చేయడానికి అనుమతించకపోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమేనని పేర్కొంది.
కోర్టు ధిక్కరణ వ్యవహారంలో ఓ సభాపతికి నోటీసులు జారీ కావడం ఉమ్మడి హైకోర్టు చరిత్రలో ఇదే ప్రథమం.
కోటమిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్ ఎమ్మెల్యే) – నల్గొండ నియోజకవర్గం
సంపత్ కుమార్ (కాంగ్రెస్ ఎమ్మెల్యే)- అలంపూర్ నియోజకవర్గం