జాతీయం ☛ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ పురోగతి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ 2017లో గణనీయమైన పురోగతి సాధించిందని.. “ చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్ డ్ లేబర్” పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో గతేడాది 132 దేశాలు తీసుకున్న చర్యలను అధ్యయనం చేసిన తర్వాత.. కేవలం 14 దేశాలు ఈ అంశంలో పురోగతి సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ 14 దేశాల్లో భారత్ ఒకటని వెల్లడించింది. భారత్ తో పాటు కొలంబియా, పరాగ్వే దేశాలు నివేదిక ప్రమాణాలను అందుకున్నాయి. International Labour Organisation రూపొందించిన 182, 138 ఒడంబడికలపై భారత్ సంతకం చేసింది. అలాగే దీనికి అనుగుణంగా బాల కార్మిక నిర్మూలన చట్టంలో మార్పులు చేసి… 18 ఏళ్లకు తక్కువ ఉన్న…
Read MoreTag: september 2018 current affairs
Weekly Current Affairs – September 16 – 23, 2018
జాతీయం ☛ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని పహాడ్ గంజ్ లో ఉన్న అంబేడ్కర్ మాధ్యమిక పాఠశాలలో చీపురి పట్టుకొని ఆవరణను శుభ్రం చేశారు. అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మహాత్ముడికి నివాళులర్పించడానికి చేపట్టిన అద్భుత కార్యక్రమమిదని మోడీ ట్వీట్ చేశారు. ☛ భారత్ – బంగ్లాదేశ్ పైప్ లైన్ నిర్మాణం ప్రారంభం భారత్ – బంగ్లాదేశ్ మధ్య పైప్ లైన్ నిర్మాణ పనులు సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల మధ్య నిర్మించనున్న 130 కిలో మీటర్ల ఫ్రెండ్…
Read MoreWeekly Current Affairs – September 8 – 15, 2018
జాతీయం ఢిల్లీలో ప్రపంచ రవాణా సదస్సు – 2018 తొలి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్(ప్రపంచ రవాణా సదస్సు) – MOVE, సెప్టెంబర్ 7, 8 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తు.. మెరుగైన రవాణాతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 15 శాతానికి చేరుకుంటాయని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆటోమోబైల్ సంస్థల సీఈవోలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. తొలి గ్లోబల్ గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ ను నీతి ఆయోగ్ నిర్వహించింది. “సేఫ్ సిటీ” నగరాలకు రూ.2,919 కోట్ల నిధులు దేశంలోని 8 ప్రధాన నగరాల్లో మహిళలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు సేఫ్ సిటీ ప్రాజెక్టుని చేపట్టిన కేంద్రం… ప్రాజెక్టు అమలు కోసం రూ.2,919.55 కోట్ల నిర్భయ…
Read MoreDownload Current Affairs PDF – Weekly – September 1 – 7 , 2018
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం టీమ్ వికాసం రోజూ వారి కరెంట్ అఫైర్స్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను అందిస్తోంది. వీక్లీ, మంత్లీ వారీగా కేటగరైజ్ చేసి అందుబాటులో ఉంచుతోంది. చదువుకోడానికి వీలుగా వెబ్ సైట్ లో పొందుపరటంతో పాటు డౌన్ లోడ్ ఆప్షన్ కూడా కల్పిస్తోంది. ఫైల్ రూపంలో వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాల్సిన వారు ఈ కింది లింక్ ను క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు – Team Vikaasam Vikaasam_Sep 1-7_Current Affairs
Read MoreDaily Current Affairs–MCQs-September 17, 2018
పీఎస్ఎల్వీ – సీ42 ప్రయోగం విజయవంతం నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని షార్ కేంద్రం ప్రథమ ప్రయోగ వేదిక నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ISRO చేపట్టిన పీఎస్ఎల్వీ – సీ 42 ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో విజయాల రాకెట్ గుర్తింపు సాధించిన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(PSLV) 889 కిలోల బరువున్న 2 బ్రిటన్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. క్లుప్తంగా రాకెట్ పేరు – పీఎస్ఎల్వీ సీ – 42 ఎత్తు – 44. 4 మీటర్లు బరువు – 230.4 టన్నులు ఉపగ్రహాలు నోవాసర్ ఎస్ : 455 కిలోలు ఎస్ 1 – 4 : 444 కిలోలు ఈ ప్రయోగంతో ఇస్రో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 239 కి చేరింది. వీటిలో…
Read MoreDaily Current Affairs–MCQs-September 16, 2018
20 రోజుల పాటు స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్ర పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అనుకునే వారు, వినూత్న ఆవిష్కర్తలను కలిసి ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్ యాత్ర సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5 వరకు 20 రోజుల పాటు జరిగే ఈ యాత్రను రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే. తారకరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 200 మంది విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలను సేకరించి అందులో 20 మందిని ఎంపిక చేస్తారు. 12 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. నీల్ బసుకి ఆసియాన్ అచీవర్స్ అవార్డు బ్రిటన్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న భారత సంతతి అధికారి నీల్ బసు .. ప్రతిష్టాత్మక ఆసియన్ అచీవర్స్ అవార్దుకు ఎంపికయ్యారు. ఆసియాన్ బిజినెస్…
Read MoreDaily Current Affairs–MCQs-September 11, 2018
గాల్లోనే ఇంధనం – తేజస్ మరో ఘనత పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్.. గాల్లోనే ప్రయాణిస్తూనే IAF IL 78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఘనత సాధించింది. దీంతో.. యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపకలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది. తేజస్ తేలికపాటి యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. 123 తేజస్ మార్క్ – 1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన 2017 డిసెంబర్ లో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కు రూ.50,000 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల దోషులకు…
Read MoreWeekly Current Affairs – September 1- 7, 2018
జాతీయం ఇండస్ వాటర్ ఒడంబడిక – భారత్, పాక్ మధ్య అవగాహన ఇండస్ వాటర్ ఒడంబడిక 1960కి అనుగుణంగా రెండు దేశాల్లో ఆయా దేశాల నీటి కమిషనర్ల పర్యటనకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. భారత్ లో జమ్ము అండ్ కశ్మీర్ లో చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాల ప్రతినిధులు ఇరు ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యలను అధ్యయనం చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు పాకిస్తాన్ లాహోర్ లో జరిగాయి. పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ తెహ్రీక్ – ఈ – ఇన్సాఫ్(PTI) అధినేత ఇమ్రాం ఖాన్ గత నెలలో ప్రమాణ స్వీకారం…
Read MoreDaily Current Affairs–MCQs-September 7, 2018
తెలంగాణ శాసనసభ రద్దు తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ రద్దయింది. నిర్ణీత కాల వ్యవధి కన్నా 8 నెలల 26 రోజుల ముందే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శాసనసభ రద్దుకి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలిలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ 2(బీ) అనుసరించిన గవర్నర్ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నోటిఫికేషన్ ను ప్రస్తావిస్తు గెజిట్ జారీ చేశారు. ఎన్నికలు జరిగి, తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రాష్ట్రంలో నిర్ణీత కాలం ప్రకారం 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా… టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముందుగానే…
Read MoreDaily Current Affairs–MCQs-September 6, 2018
జన్ ధన్ ఓవర్ డ్రాఫ్ట్ రూ.10 వేలకు పెంపు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం కింద ప్రస్తుతం రూ.5 వేల పరిమితితో ఉన్న ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న ప్రకటించింది. అలాగే పథకానికి అర్హతకు గరిష్ట వయసుని 60 నుంచి 65 ఏళ్ల పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పథకానికి మంచి ఆదరణ లభిస్తుందన్నందున.. కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రూ. 2 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందేందుకు ఎలాంటి షరతులు ఉండవని వివరించారు. ఇవీ జన్ ధన్ లెక్కలు జన్ ధన్ యోజన కింద నాలుగేళ్లలో 32.41 కోట్ల ఖాతాలు తెరిచారు. వీటిలో రూ.81,200 కోట్ల…
Read More