2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చైర్మన్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్ర ఐబీఏ డిప్యూటీ చైర్మన్గా ఎంపికయ్యారు.
- ప్రస్తుతం ఐబీఏ డిప్యూటీ చైర్మన్లుగా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు.
- ఐబీఏ.. భారత బ్యాంకులు, ఆర్థిక సంస్థల సంఘం. దీనిని 1946 సెప్టెంబర్ 26న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది.
- ప్రస్తుతం ఐబీఏలో 237 మంది సభ్యులు ఉన్నారు.
మాదిరి ప్రశ్న
2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు ?
-
సునీల్ మోహతా
-
రజనీష్ కుమార్
-
దీనబంధు మొహపాత్ర
-
శ్యామ్ శ్రీనివాసన్
జవాబు: సునీల్ మోహతా