☛ స్వాతిలక్రాకు డాటర్స్ ఇండియా అవార్డు
తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో మహిళా భద్రతా విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ స్వాతిలక్రా… రాజస్థాన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక డాటర్స్ ఇండియా అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 29న రాజస్థాన్ లో జైపూర్ లో జరిగిన హెల్త్ కేర్ సదస్సులో స్వాతి లక్రా ఈ అవార్డు అందుకున్నారు.
-
సేవ్ గర్ల్, ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగాల్లో దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న సామాజిక వేత్తలకు, అధికారులకు రాజస్థాన్ ప్రభుత్వం ఏటా ఈ అవార్డు అందజేస్తుంది.
☛ భారత యువతి అమికా జార్జ్ కు గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ సోషల్ అవార్డు
కేరళకు చెందిన అమికా జార్జ్… బిల్, మెలిండా ఫౌండేషన్ ప్రారంభించిన గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ అవార్డుకు ఎంపికయ్యారు. అమికా.. బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ఫ్రీ పీరియడ్స్ ఉద్యమం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఉద్యమం ఫలితంగా బ్రిటన్ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమ అవసరాలు తీర్చేందుకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ కోసం 1.5 మిలియన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అమికాతో పాటు మరో ఇద్దరు మహిళలకు ఈ అవార్డు దక్కింది.
-
సామాజిక అభివృద్ధి రంగంలో.. గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ సోషల్ అవార్డుని ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు.
☛ ఇండోనేషియాలో ప్రకృతి విప్తత్తు.. భారీ ప్రాణ నష్టం
ఇండోనేషియాలో సంభవించిన భూకంపం, సునామీ భారీ విధ్వంసం సృష్టించాయి. సెప్టెంబర్ 28న రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం, ఆ వెంటనే సునామీ విరుచుకుపడటంతో 400 మందికిపైగా మృతి చెందారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
☛ ఐరాస జనరల్ అసెంబ్లీలో సుష్మా ప్రసంగం
న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 29న సాధారణ అసెంబ్లీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రతినిధిగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగించారు. ఉగ్రవాదం అంశంలో పాకిస్తాన్ తీరుని ఎండగట్టారు. చర్చలు జరుపుతామని చెబుతూనే.. ఇటీవల భారత జవాన్ల చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంకా సుష్మ తన ప్రసంగంలో.. ప్రపంచానికి పర్యావరణ మార్పులు విసురుతున్న సవాళ్లు, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన తదితర అంశాలను ప్రస్తావించారు.
☛ CISC అధిపతిగా రాజేశ్వర్
Chief of Intergrated Defence – CISC గా లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్. రాజేశ్వర్ నియమితులయ్యారు. అక్టోబర్ 31న ప్రస్తుత చీఫ్ లెఫ్టినెంట్ జనర్ సతీశ్ దువా పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో పి.ఎస్. రాజేశ్వర్ బాధ్యతలు చేపడతారు.
-
CISC త్రీవిధ దళాలాతో కూడిన సమీకృత రక్షణ సిబ్బంది విభాగం
-
ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ విభాగాన్ని 2001 నవంబర్ 23న ఏర్పాటు చేశారు
-
దీని కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది
☛ పీటీఐ చైర్మన్ గా ఎన్. రవి
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా( PTI) చైర్మన్ గా హిందూ గ్రూపు పేపర్స్ పబ్లిషర్ ఎన్. రవి ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 29న జరిగిన ఎన్నికల్లో రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా పంజాబ్ కేసరి గ్రూపు పత్రికల ప్రధాన సంపాదకుడు విజయ్ కుమార్ చోప్రాను ఎన్నుకున్నారు.
-
PTI అనేది భారత్ లో అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ
-
పీటీఐని 1947 ఆగస్టు 27న ఏర్పాటు చేశారు
☛ ఆర్చరీ ప్రపంచ కప్ లో జ్యోతి సురేఖ జోడికి రజతం
టర్కీలోని సామ్సన్ నగరంలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ లో ఎగ్జిబిషన్ కాంపౌండ్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో భారత్ జోడి రజతం గెలుచుకుంది. సెప్టెంబర్ 29న జరిగిన ఫైనల్లో తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ్, అర్చర్ అభిషేక్ జోడి 152 – 159 స్కోర్ తేడాతో టర్కీ జట్టు చేతిలో ఓడిపోయింది. దీంతో రజతం దక్కింది.