☛ ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
ఆధార్ రాజ్యాంగ బద్ధమే అని పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెప్టెంబర్ 26న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీని ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న వాదనలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు 12 సంకెల ఆధార్ నంబర్ ను కొన్ని సేవలకు మాత్రమే తప్పనిసరి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 తో 1,442 పేజీల కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనంలో ఇదర సభ్యులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఖన్విల్కర్.
తీర్పులోని ముఖ్యాంశాలు
-
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి
-
ఆదాయ పన్ను దాఖలు, పాన్ నెంబర్ కు ఆధార్ తప్పనిసరి
-
ప్రభుత్వం నుంచి రాయితీ పొందే పథకాలకు ఆధార్ తప్పనిసరి
-
బ్యాంకు ఖాతా తెరవడానికి ఆధార్ అవసరం లేదు
-
టెలికం సంస్థలకు ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సిమ్ కార్డు పొందడానికి కూడా అవసరం లేదు
-
విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఆధార్ అవసరం లేదు
-
సీబీఎస్ఈ, యూజీసీ, నీట్ వంటి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు
ఆధార్ గురించి మరింత సమాచారం
-
ఆధార్ ను 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది
-
2010 సెప్టెంబర్ లో తొలి ఆధార్ నెంబర్ కేటాయించారు
-
2010 డిసెంబర్ లో ఆధార్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టారు
-
2016 సెప్టంబర్ లో అమల్లోకి వచ్చిన ఆధార్ చట్టం
☛ అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణిని శాస్త్రవేత్తలు సెప్టెంబర్ 26న విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమబెంగాల్ లోని కలైకుండా ఐఏఎఫ్ స్థావరం నుంచి సుఖోయ్ – 30 యుద్ధ విమానం ద్వారా దీన్ని పరీక్షించారు. క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను ఛేదించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
-
గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన అస్త్ర క్షిపణిని డీఆర్డీవోతో పాటు మరో 50 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి.
-
ఈ క్షిపణిని ప్రయోగించేందుకు వీలుగా సుఖోయ్ – 30 యుద్ధ విమానాన్ని ఆధునీకరించారు.
-
ఈ క్షిపణి 20 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు గాలిలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది.
☛ నరేంద్ర మోదీకి “చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్” అవార్డు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి అందించే ప్రతిష్టాత్మక “చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్” అవార్డుకి ఎంపికయ్యారు. మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ కూడా ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ మేరకు ఐరాస సెప్టెంబర్ 26న ప్రకటించింది. అంతర్జాతీయ సౌర కుటమి ఏర్పాటులో ఇద్దరు నేతలు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు పొందారు.
-
“చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్” ఐరాస ఇచ్చే అత్యున్నత పర్యావరణ పురస్కారం.
-
సౌర శక్తితో నడుస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందిన కొచ్చి విమానాశ్రయానికి కూడా “చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్” అవార్డు దక్కింది.
☛ కరీంనగర్ – ముంబై వీక్ల ఎక్స్ ప్రెస్ ప్రారంభం
కరీంనగర్ – లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వీక్లీ ఎక్స్ ప్రెస్ ను రైల్వే సహాయ మంత్రి రాజెన్ గోహెన్ సెప్టెంబర్ 26న జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు రైలుని ప్రారంభించారు. దీంతో… ఇప్పటి వరకు నిజామాబాద్ – ముంబై మధ్య నడుస్తున్న ఈ ఎక్స్ ప్రెస్.. ఇక నుంచి కరీంనగర్ వరకు వెళుతుంది.
-
కాజీపేట – కొండపల్లి మధ్య 3వ లైను నిర్మాణ పనులని మంత్రి ప్రారంభించారు.
☛ NDCC కి కేంద్ర కేబినెట్ ఆమోదం
National Digital Communications Policy – 2018(NDCC) కి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 26న ఆమోదం తెలిపింది. 2022 నాటికి దేశీయ టెలికం రంగంలో 10 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఈ రంగంలో 40 లక్షల ఉద్యోగాల కల్పన ఈ పాలసీ ముఖ్య లక్ష్యం. కొత్త పాలసీతో స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)లో టెలికం రంగం వాటా ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 8 శాతానికి పెరుగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.
☛ రాజ్యాంగ ప్రాధాన్యమున్న కేసుల విచారణ లైవ్
కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న ప్రతిపాదనకు సుప్రీం కోర్టు సెప్టెంబర్ 26న అంగీకారం తెలిపింది. పైలెట్ ప్రాజెక్టుగా మొదట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ప్రాధాన్యమున్న కేసులను మాత్రమే లైవ్ ఇస్తారని వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత అన్ని కేసులకు లైవ్ అనుమతిస్తామని కోర్టు స్పష్టం చేసింది.