☛ ధోని కెప్టెన్ @ 200వ వన్డే
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా 200వ వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 25న ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ధోని ఈ నంబర్ ను అందుకున్నాడు. వాస్తవానికి ధోని 2016లోనే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రెండేళ్ల కిందట విశాఖపట్నంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ధోనికి కెప్టెన్ గా 199వ ది. ఆసియా కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో… ధోని కెప్టెన్ గా అనూహ్యంగా బరిలో దిగాల్సి వచ్చింది.
☛ శ్రీలంకతో టీ20 సీరీస్ ను 4-0తో నెగ్గిన భారత్ మహిళల జట్టు
-
శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్ లో టీ20 సీరీస్ ను భారత్ మహిళల జట్టు 4 – 0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి టైటిల్ గెలుచుకుంది. ఒక మ్యాచ్ వర్ష కారణంగా రద్దయింది.
-
మహిళల టీ20 టీమ్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్
-
ఈ పర్యటనలో వన్డే సీరీస్ ను కూడా టీమ్ ఇండియా 2 – 1తేడాతో గెలుచుకుంది.
☛ బార్ క్లేస్ హురున్ ఇండియా – 2018
బార్ క్లేస్ హురున్ ఇండియా 2018 సంవత్సరానికి గాను సెప్టెంబర్ 25న విడుదల చేసిన సంపన్న భారతీయుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. హిందూజా కుటుంబం రెండో స్థానంలో ఉండగా, 3వ స్థానంలో ఎల్ ఎన్ మిట్టల్ ఉన్నారు.
-
తొలి స్థానంలో ముకేశ్ అంబానీ సంపద విలువ రూ. 3,71,000 కోట్లు
-
2వ స్థానంలో ఉన్న హిందూజా కుటుంబం సంపద విలువ రూ.1,59,000 కోట్లు
-
3వ స్థానంలో ఉన్న ఎల్ ఎన్ మిట్టల్ సంపద విలువ రూ. 1,14,500 కోట్లు
☛ ఆహార శుద్ధి పరిశ్రమలోకి బిలియన్ డాలర్ల పెట్టుబడులు
భారత్ లోని ఆహార శుద్ధి పరిశ్రమల్లోకి 2018 సెప్టెంబర్ వరకు బిలియన్ డాలర్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI)లు వచ్చాయి. భారత కరెన్సీలో ఆ విలువ రూ.7,200 కోట్లు. ఈ మేరకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ సెప్టెంబర్ 25న వెల్లడించారు.
☛ ప్రకృతి సేద్యం – ఐరాస వేదికపై చంద్రబాబు ప్రసంగం
ప్రకృతి వ్యవసాయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించారు. “సుస్థిరి సేద్యానికి ప్రకృతి చేయూత – ఆర్థిక సవాళ్లు – అవకాశాలు” అనే అంశంపై న్యూయార్క్ లోని ఐరాస కార్యాలయంలో సెప్టెంబర్ 25న జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. కీలకోపన్యాసం చేశారు.
ప్రసంగంలోని ముఖ్యంశాలు
-
రాష్ట్రం జీఎస్ డీపీలో వ్యవసాయం వాటా 28 శాతం
-
రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే ఆధారం
-
ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
-
2018లో రాష్ట్రంలో 5 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు
-
2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు ప్రకృతి సేద్యం చేయాలన్నది లక్ష్యం
-
2022 నాటికి 4.1మిలియన్ల రైతులని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలన్నది లక్ష్యం
-
2024 నాటికి 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలన్నది ధ్యేయం.
-
ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్న చంద్రబాబు
☛ “ముఖ్యమంత్రి యువనేస్తం“కు దరఖాస్తుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు భృతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ముఖ్యమంత్రి యువనేస్తం” పథకానికి దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. సెప్టెంబర్ 14న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెబ్ సైట్ ను అధికారికంగా ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అంటే.. 12 రోజుల్లో 3,69,864 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు 1,00,004 మందిని అర్హులుగా గుర్తించారు. అర్హులైన వారికి 2018 అక్టోబర్ 2 నుంచి నెలకి రూ.1000 నిరుద్యోగ భృతి చెల్లించనున్నారు. ఈ మొత్తం నేరుగా వారి ఖాతాల్లోకి వస్తుంది.
☛ ఆంధ్రప్రదేశ్ లో చేనేతలకు ఉచిత విద్యుత్
ఆంధ్రప్రదేశ్ లో చేనేతలకు ఉచిత విద్యుత్ విధానం సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 90,765 చేనేత కుటుంబాలకు ప్రతి నెలా 100 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు.
☛ MSMEలకి గంటలో రుణం – పోర్టల్ ప్రారంభం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు గంటలో రుణం మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక సెప్టెంబర్ 25న ప్రత్యేక పోర్టల్ ప్రారంభించారు. ఈ మేరకు www.psbloansin59minutes.com వెబ్ సైట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లాంఛనంగా ప్రారంభించారు. Small Industries Development Bank(SIDBI), మరో 5 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తాయి.
-
అవసరమైన అన్ని పత్రాలతో వెబ్ సైట్లో దరఖాస్తు చేసిన గంట లోపు రుణాన్ని మంజూరు చేస్తారు.
-
ఈ విధానం ద్వారా రూ. కోటి వరకు రుణం ఇస్తారు.
☛ ఢిల్లీలో WAYU పరికరాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన WAYU(Wind Augmentation Purifying Unit) పరికరాన్ని న్యూఢిల్లీలోని ముకర్బా చౌక్ వద్ద సెప్టెంబర్ 25న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ ఆవిష్కరించారు.
-
Council of Scientific and Industrial Research – National Environmental Engineering Research Institute (CSIR-NEERI) రూపొందించిన ఈ పరికరం గాలిలో కాలుష్య కారకాలను పీల్చుకొని స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది.
-
500 చదరపు మీటర్లు పరిధిలో గాలిని పీల్చుకుంటుంది.
-
సగం యూనిట్ విద్యుత్ తో ఈ పరికరం 10 గంటలు పనిచేస్తుంది.
-
దీనికి నెల రోజుల నిర్వహణ వ్యయం కేవలం రూ.1500
☛ ఒకే పన్ను రేటుపై ఉత్తరాది రాష్ట్రాల అంగీకారం
ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు మరో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ, చంఢీగఢ్ … పెట్రో ఉత్పత్తులపై ఒకే పన్ను రేటు విధించేందుకు అంగీకరాం తెలిపాయి. వీటితో పాటు మద్యం అమ్మకాలు, వాహనాల రిజిస్ట్రేషన్లు, రవాణా పర్మిట్లు పై కూడా ఈ రాష్ట్రాల్లో ఒకే పన్ను రేటు ఉండాలని నిర్ణయించాయి. పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీని ద్వారా బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలన్నది లక్ష్యం.