☛ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ పురోగతి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ 2017లో గణనీయమైన పురోగతి సాధించిందని.. “ చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్ డ్ లేబర్” పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో గతేడాది 132 దేశాలు తీసుకున్న చర్యలను అధ్యయనం చేసిన తర్వాత.. కేవలం 14 దేశాలు ఈ అంశంలో పురోగతి సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ 14 దేశాల్లో భారత్ ఒకటని వెల్లడించింది. భారత్ తో పాటు కొలంబియా, పరాగ్వే దేశాలు నివేదిక ప్రమాణాలను అందుకున్నాయి.
-
International Labour Organisation రూపొందించిన 182, 138 ఒడంబడికలపై భారత్ సంతకం చేసింది. అలాగే దీనికి అనుగుణంగా బాల కార్మిక నిర్మూలన చట్టంలో మార్పులు చేసి… 18 ఏళ్లకు తక్కువ ఉన్న పిల్లలతో పని చేయించడం నేరం కిందకి వస్తుందని పేర్కొంది.
-
International Labour Organisation ను 1919 ను ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.
☛ 2018 ఆస్కార్ బరిలో భారత్ సినిమా “విలేజ్ రాక్ స్టార్స్“
2018 ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్స్ మొదల్యాయాయి. ఈ అవార్డుల కోసం ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి “విలేజ్ రాక్ స్టార్స్” చిత్రం అధికారికంగా ఎంపిక చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 22న ఈ మేరకు వెల్లడించింది.
-
విలేజ్ రాక్ స్టార్స్.. అస్సామీ సినిమా.
-
దర్శకురాలు – రీమా దాస్
-
2018 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. ఈ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్, ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.
-
భారత్ 1957 నుంచి ఆస్కార్ కు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేషన్లు పంపుతోంది.
-
1986లో కే. విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతిముత్యం ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ రేసు వరకు వెళ్లింది. కానీ నామినేషన్ దక్కించుకోలేదు.
-
స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, రసూల్ వూకుట్టికి ఆస్కార్ వచ్చినా… ఆ చిత్రం బ్రిటీష్ సినిమా కింద రావటంతో… భారత్ ఖాతాలోకి అవార్డు రాలేదు.
☛ ఏపీ ఎమ్మెల్యేని కాల్చి చంపిన మావోయిస్టులు
ఆంధ్రప్రదేశ్ విశాఖటపట్నం జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపారు. సెప్టెంబర్ 23న డుంబ్రిగూడ మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలోని లివిటిపుట్టులో ఈ ఘటన జరిగింది. గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను అడ్డగించిన మావోయిస్టులు.. వారిపై కాల్పులు జరిపారు.
☛ దేవెందర్ గౌడ్ “మై జర్నీ” పుస్తక ఆవిష్కరణ
“మై జర్నీ” పేరుతో టీడీపీ సీనియర్ నేత తూళ్ల దేవెందర్ గౌడ్ రాసిన తన జీవిత చరిత్ర పుస్తకాన్ని.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెప్టెంబర్ 23న హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
☛ పాన్ పసిఫిక్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత కరోలినా ప్లిస్కోవా
జపానా రాజధాని టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ – 2018 మహిళల సింగిల్స్ టైటిల్ ను చెక్ రిపబ్లిక్ కు చెందిన కరోలినా ప్లిస్కోవా గెలుచుకుంది. సెప్టెంబర్ 23న జరిగిన ఫైనల్లో కరోలినా… జపాన్ కు చెందిన నయోమి ఒసాకాను ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది.
-
ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ – 2018 మహిళల సింగిల్స్ టైటిల్ ను నెగ్గిన ఒసాకా.. గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి జపాన్ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది.
☛ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్ లో ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23న జార్ఖండ్ లోని రాంచీలో అధికారికంగా ప్రారంభించారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన – PM JAY పేరుతో పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోని పేదలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించడం ఈ పథకం ఉద్దేశం
-
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్య బీమా పథకం
-
పథకం ద్వారా దేశంలోని 10 కోట్ల కుటుంబాల్లోని దాదాపు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
-
తాజా సామాజిక, ఆర్థిక కుల గణన (SECC) సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో 2.33 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని పొందవచ్చు.
-
పథకంలో నమోదు కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
-
రాష్ట్రాల వద్ద ఉన్న దారిద్ర్య రేఖకు దిగవునున్న వారి వివరాలను నేరుగా పథకంలో చేరుస్తారు.
-
దేశవ్యాప్తంగా 445 జిల్లాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైంది.
-
గుండె సర్జరీ, మూత్రపిండాలు, లివర్ సమస్యలు, మోకాలి చిప్ప మార్పిడి, షుగర్ తదితర 1300కు పైగా వ్యాధులకు ఈ బీమా వర్తిస్తుంది.
-
తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పంజాబ్ మినహా… మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు… ఈ పథకంలో చేరాయి.
-
పథకం అమలుకు కేంద్రం 60 శాతం నిధులను అందిస్తుంది. మిగతా 40 శాతం ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.
-
71వ జాతీయ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(NSSO) ప్రకారం.. 85.9 శాతం గ్రామీణ కుటుంబాలు, 82 శాతం పట్టణ కుటుంబాలకు ఆరోగ్య బీమా లేదు.
-
ఆయుష్మాన్ భారత్ CEO – ఇందూ భాషణ్
☛ 5జీ సేవల కోసం జపాన్ సంస్థలతో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం
భారత్ లో 5జీ సేవలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ – BSNL కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్.. జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్, ఎన్ టీటీ కమ్యూనికేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా చొరవతో ఈ ఒప్పందం జరిగినట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు సెప్టెంబర్ 22న వెల్లడించారు.
☛ డీబీహెచ్ఎస్ వందేళ్ల వేడుకలను ప్రారంభించిన రాష్ట్రపతి
దక్షిణ భారత హిందీ మహాసభ(DBHS) వందేళ్ల వేడుకలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో ప్రారంభించారు. డీబీహెచ్ఎస్ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో స్వతంత్ర హోదాలో పనిచేస్తోన్న సంస్థ.
-
దక్షిణ భారతంలో హిందీ భాషా అభివృద్ధి కోసం 1918లో దక్షిణ భారత హిందీ మహాసభను ఏర్పాటు చేశారు.
-
తద్వారా దక్షిణ, ఉత్తర భారత అనుసంధానానికి ఉన్న భాషా బేధాన్ని తొలగించాలన్నది లక్ష్యం.
-
డీబీహెచ్ఎస్ కేంద్ర కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో ఉంది.
-
మహాత్మా గాంధీ సహకారంతో అన్నీ బీసెంట్ ఈ సంస్థను నెలకొల్పారు.
-
గాంధీజీ ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
-
1964లో కేంద్ర ప్రభుత్వం డీబీహెచ్ఎస్ ను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించింది.
☛ ఒడిశాలో ఝార్సుగూడా ఎయిర్ పోర్టుని ప్రారంభించిన ప్రధాని
ఒడిశాలోని ఝార్సుగూడాలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టంబర్ 23న ప్రారంభించారు. ప్రాంతీయ అనుసంధాన పథకం(Regional Connectivity Scheme – RCN) UDAN( Ude Deshk Ka Aaam Naagrik) లో భాగంగా నిర్మించిన తొలి ఎయిర్ పోర్టు ఇది.
-
ఈ విమానాశ్రయం ద్వారా ఒడిశాలోని భువనేశ్వర్, రాయ్ పూర్, రాంచీ నగరాలతో ప్రాంతీయ అనుసంధానం ఏర్పడుతుంది.
-
ఒడిశాలోని మరో మూడు నగరాలు.. జైపూర్ (కొరాపుట్ జిల్లా), రూర్ కేలా(సుందర్ ఘర్ జిల్లా), ఉట్కేలా(కాలాహండి జిల్లా) లో విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయి.
☛ భారత్ లో వాట్సాప్ గ్రీవెన్స్ అధికారిగా కోమల్ లాహిరి
వాట్సాప్ ద్వారా సమాచార దుర్వినియోగం, తప్పుడు వార్తల ప్రచారం ఎక్కువ అవుతోందన్న ఆరోపణలతో.. వాటిని అరికట్టేందుకు సంస్థ ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ తరహా ఆరోపణలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు అమెరికాలో పనిచేస్తోన్న కోమల్ లాహిరిని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది.
-
వినియోగదారులు ఈ – మెయిల్, యాప్ లేదా రాతపూర్వకంగా గ్రీవెన్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
-
కోమల్ లాహిరి వాట్సాప్ గ్లోబల్ కస్టమర్ ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అంతకముందు ఆమె ఫేస్ బుక్ డైరెక్టర్ గా ఉన్నారు.